దాచేపల్లి: కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం

దాచేపల్లి మండలం పొందుగుల గ్రామ శివారులోని కృష్ణా నదిలో బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్