పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, రామకృష్ణ సేవాసమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మంగళవారం మొబైల్ కూలింగ్ ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి కలెక్టర్ కృత్తికా శుక్ల, సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి నివాళులర్పించారు. వేసవిలో బాటసారుల దప్పిక తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.