నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. వీర లక్ష్మీపురం రెవిన్యూ పరిధిలోని 265 మంది రైతులకు ఈ పాస్పుస్తకాలను అందించినట్లు వారు తెలిపారు. పట్టాదారు పాస్పుస్తకం రైతులకు మన ఆస్తి, మన హక్కు అని వారు పేర్కొన్నారు.