పల్నాడు జిల్లా కారంపూడిలో కూటమి పార్టీల నాయకులను, కార్యకర్తలను అసభ్యకరంగా దూషిస్తూ వ్యక్తిగత మాటలు మాట్లాడితే తాట తీస్తామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరు అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై అవమానకరమైన పదజాలంతో మీడియా ముందు మాట్లాడుతుండటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు.