దేహ్రాదూన్లో జరిగిన 21వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్ జెస్సీ రాజ్ మాత్రపు ఇంటర్మీడియెట్ నోవిస్ ఉమెన్ (జూనియర్స్) విభాగంలో రజత పతకం సాధించింది. రాష్ట్రం నుంచి పాల్గొన్న ఐదుగురు బాలికల్లో అత్యధిక స్కోరు సాధించి ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విజయంపై ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, రాష్ట్ర సంఘం నాయకులు, కోచ్లు ఆమెను అభినందించారు.