మంగళగిరి: జగన్ మాటలను సీరియస్గా తీసుకోవద్దు: లోకేశ్

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకుడు నారా లోకేశ్ అన్నారు. మావిగన్ అన్న నోటితోనే మళ్లీ మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉంటున్నారని లోకేశ్ ఆరోపించారు. తన ఇంటి వద్ద 30 అడుగుల ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారని, 2019లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్