పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ పరిధిలోని మామిడి గార్డెన్స్ వద్ద నూతన సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. వర్షం నీరు నిలిచి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవున సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆమె పేర్కొన్నారు.