పల్నాడులో కాసు, జూలకంటి కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా మహేశ్ రెడ్డి, పల్నాటి పులిగా పేరు పొందిన జూలకంటి నాగిరెడ్డి వారసుడిగా బ్రహ్మానంద రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వైసీపీ, టీడీపీల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం, పల్నాడు ప్రాంతానికి ఏ కుటుంబం ఏమి చేసిందనే చర్చకు దారితీసింది.