ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఆదివారం అద్దంకిలో గో ఆధారిత సహజ వ్యవసాయంపై నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న 108 మంది రైతులకు సన్మానం చేసి, ఆదర్శ రైతులుగా ప్రశంసాపత్రాలు అందించారు. ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యం శ్రేయస్కరం అని ఆయన అన్నారు.