రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మరో 400 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి నారాయణ బుధవారం తుళ్లూరులో మాట్లాడుతూ, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజధాని పనులు వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.