పెదకూరపాడు నియోజకవర్గం గారపాడు గ్రామంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం పర్యటించారు. రూ. 25 కోట్లతో అమరావతి–బెల్లంకొండ మధ్య 49 కిలోమీటర్ల లింక్ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. గ్రామాలన్నింటిని అనుసంధానించేలా రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.