కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. గుంటూరులో ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ కార్యదర్శి మాల్యాద్రి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలు, గ్రాట్యుటీని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.