నరసరావుపేటలో గురువారం నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.