పెదకూరపాడు ముస్లిం పల్లికి చెందిన ఇద్దరు మైనర్ యువకులు మంగళవారం లోలెవెల్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాల ఢీ కొనడం తో తీవ్రంగా గాయపడ్డారు. 17 ఏళ్ల ఇస్మాయిల్తో పాటు మరో మైనర్ యువకుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇస్మాయిల్కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని 108 ఆంబులెన్స్లో గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికి సమీప సీహెచ్సీలో ప్రాథమిక చికిత్స అందించినట్లు స్థానికులు తెలిపారు.