పొన్నూరు: తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నగదు పంపిణీ

పొన్నూరు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శనివారం, తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని 654 మంది ప్రజలకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నగదు పంపిణీ చేశారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 1600 రూపాయల విలువైన నిత్యవసర సరుకులు కూడా అందజేశామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్, అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్