చేబ్రోలు మండలంలోని ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ. 2.13 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. నారాకోడూరులోని శ్రీ గణపలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 1.20 కోట్లు, శలపాడులోని శ్రీ రామలింగేశ్వర, చంద్రశేఖరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 93.33 లక్షలు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.