రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పొన్నూరు నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యార్థులలో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు నారాకోడూరు జడ్పీ పాఠశాలలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పొన్నూరు మండలం మాచవరం జడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంఈఓ కె విజయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఆయనతో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.