సంక్రాంతి సెలవుల సందర్భంగా పిల్లల భద్రతపై ప్రత్తిపాడు సీఐ గన్నవరపు శ్రీనివాసరావు తల్లిదండ్రులకు సూచనలు జారీ చేశారు. గాలిపటాలు ఎగరేసేటప్పుడు చైనీస్ మాంజా వాడకుండా, కేవలం సాంప్రదాయ నూలు దారంతోనే ఎగరేయాలని, పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. సెలవుల్లో పిల్లలను కంటి రెప్పలా గమనిస్తూ ఉండాలని సూచించారు.