రేపల్లె మండలంలోని రావి అనంతవరం పెనుమూడి, పల్లిపాలెం గ్రామాలలో నది ఒడ్డున నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పెనుమూడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను మంత్రి సోదరులు శివప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్డిఓ రామలక్ష్మి, తహసిల్దార్ శ్రీనివాసరావు బాధితులకు భోజనం వడ్డించారు. వరద ప్రభావం తగ్గే వరకు పునరావాస కేంద్రాలలోనే ఉండాలని వారు సూచించారు.