రాత్రి పగలు కష్టపడి పండించిన ఆక్వా ఉత్పత్తులను దళారులు మోసం చేసి రైతులను నట్టేట ముంచుతున్నారని వైఎస్ఆర్సిపి రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీఠ నాగమోహన్ కృష్ణ బుధవారం నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో ఆక్వా రైతులతో మాట్లాడుతూ ఆరోపించారు. కూటమి నాయకుల అండదండలతో దళారులు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు.