అమరావతి మండల విద్యాశాఖ అధికారి-1గా కె. ఎస్. ఎన్. ప్రసాద్ ఇవాళ అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు ప్రభుత్వ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన ఆయన అమరావతి మండల విద్యాశాఖ అధికారి పదవికి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సహఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ తెలిపారు.