పల్నాడు జిల్లా ముప్పాల మండలం బొల్లారం అడ్డరోడ్ వద్ద శుక్రవారం ముప్పాల పోలీసులు మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బేతపూడి గ్రామానికి చెందిన మోహిద్దీన్ వ్యాన్ లో 16 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అతడిని, బియ్యం వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపారు.