పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లలో నాగమల్లేశ్వరావు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ జరిగింది. నేరాలకు దూరంగా ఉండి, సమాజంలో శాంతియుతంగా జీవించాలని, చట్టాన్ని గౌరవించి బాధ్యతాయుత పౌరులుగా మారాలని సూచించారు. నేర జీవితం భవిష్యత్తును, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని వివరించారు.