పల్నాడు జిల్లా సత్తెనపల్లి 19వ వార్డు సుందరయ్య కాలనీలోని జనావాసాల మధ్య తలపై గాయాలతో కదలలేని స్థితిలో చుక్కల జింక ప్రత్యక్షమైంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు రంగంలోకి దిగి జింకను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.