ఈ నెల 5న తాడికొండలో జరిగిన మరియదాసు హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బ్రిక్ రాళ్లతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. నూతక్కి నరేష్, కటారి జాషువా, గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వాసు తెలిపారు.