తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆదివారం పేరేచర్లలో జరిగిన తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవ సదస్సులో మాట్లాడుతూ, ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు చురుకుగా సాగుతున్నాయని, గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అమరావతికి తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు.