రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ యంత్రాల నుండి డీజిల్ చోరీ జరుగుతోందని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తుళ్లూరు పోలీసులు, ఎలాంటి అనుమతులు లేకుండా డీజిల్ కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్న ఒక దుకాణాన్ని గుర్తించారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఈ ఘటనపై కేసు నమోదు చేయబడింది.