శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఛైర్మన్ మోషేన్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'క్రిస్టియన్ అని ఎవరిని అంటున్నారు?' అని ప్రశ్నిస్తూ, తాను క్రిస్టియన్ను కాదని, హిందువునే అని స్పష్టం చేశారు. సభలో ఇలాంటి వ్యక్తిగత, మతపరమైన ప్రస్తావనలు తగవంటూ మంత్రి తీరును ఛైర్మన్ తప్పుబట్టారు. ఈ సంఘటన శాసనమండలిలో చర్చనీయాంశమైంది.