తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామ శివారులో జరుగుతున్న జూదంపై అర్ధరాత్రి గ్రామీణ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.