షేక్ నాయబ్ రసూల్ అనే వ్యక్తి సోమవారం ఉదయం బైక్పై వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో మరణించాడు. పండుగకు తెనాలి వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో గౌస్ బాషా, వసీమ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భాషా తో పాటు మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి, వారికి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.