అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని అభివృద్ధి పనులపై ఇంటింటికీ తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు వివరించనున్నారు. కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని నాయకులు కోరారు.