స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో వినుకొండలో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా అదనపు బస్సులు నడపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం డిపోలో బస్సులు బయలుదేరకముందే వందలాది మంది సీట్ల కోసం పోటీ పడుతూ తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వెంటనే అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.