వినుకొండ: ప్రజా దర్బార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్