వినుకొండ పట్టణం 23వ వార్డు, డబ్బా సెంటర్ సోమవారం "సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి ప్రచారం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆంజనేయులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు.