ఏపీలో కొత్త సీఎస్ (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) ఎవరనే దానిపై చర్చ జోరుగా నడుస్తోంది. ఈ రేసులో ప్రధానంగా జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె. విజయానంద్ ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు విజయానంద్ నియమకాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. కాగా, సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.