ఏపీలో భారీగా వర్షం (వీడియో)

తిరుపతి జిల్లాలో దిత్వా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో కూడా భారీ వర్షం కురుస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు చలి, ఈదురు గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అటువైపు వెళ్లవద్దని, చెట్ల కింద ఆగవద్దని టీటీడీ అధికారులు భక్తులను హెచ్చరించారు. వర్షం తగ్గే వరకు గదులకు వెళ్లాలని, క్యూలైన్లలో కాకుండా కంపార్టుమెంట్లలో వేచి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్