తమిళ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి వృద్ధాప్య సమస్యలతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషాద సమయంలో పలువురు సినీ ప్రముఖులు అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అజిత్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తూ, మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.