AP: అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై అంబటి భార్య దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబటి ఇంటి వద్ద శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అంబటి కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.