AP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశం సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇందులో భాగంగా మహానాడు నిర్వహణపై చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ దాడిలో అమరులకు నివాళులర్పించడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ను విడుదల చేశారు.