విశాఖ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఉదయం వేళల్లో విమాన సర్వీసులు ఉదయం లేకపోవడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ” అంటూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ హై కమాండ్ అసహనం వ్యక్తం చేసింది. 'ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి. విమానయాన శాఖ మంత్రి మనవారే కదా.. రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేయొచ్చు కదా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.