AP: అమరావతి పరిధిలో పేద ప్రజల నివాసానికి గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. హైకోర్టు భవనాల దగ్గర రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అంగీకరించారు. అలాగే పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు ఆమోదం తెలిపారు.