పవన్‌ను కలిసిన హైడ్రా కమిషనర్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తెలంగాణకు చెందిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. పవన్, రంగనాథ్ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలోనూ తెలంగాణ తరహా అక్రమ కట్టడాల తొలగింపు ఉంటుందా? అనే చర్చ మొదలైంది.

సంబంధిత పోస్ట్