AP: వైసీపీ మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను కేసులు, అరెస్టులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు. డబ్బు ఉందన్న అహంకారంతో తన ఇంటిపై దాడి చేయించిందని ఆరోపించారు. తాను బుధవారం చెన్నై హాస్పిటల్కి వెళ్లగా, తాను పారిపోయినట్లు ప్రచారం చేయడం దారుణమన్నారు.