ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే వెంటనే రద్దు చేశారు: చంద్రబాబు

గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా లబ్ధిదారుల పేర్లు జాబితా నుంచి తొలగించేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడిన ఆయన, సంక్షేమ పథకాల అమలులో గతంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటోందని, పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్