ఏపీలో రైలు ప్రమాదం తప్పింది. శ్రీసత్యసాయి జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప స్తంభాలు ఉంచారు. ఇది గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.