AP: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వైసీపీ పేర్కొంది. శనివారం ఎక్స్ వేదికగా.. ‘ఉద్యోగాలు అంటూ ఊరించి.. కోట్ల రూపాయలకు పోస్టులను కూటమి నేతలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల్ని నిండా ముంచేసి జేబులు నింపుకుని ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు. సమగ్ర విచారణ కోరుతూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు’ అని వైసీపీ ట్వీట్ చేసింది.