జగన్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా?.. లేదా?: అనిత

AP: అమరావతి రాజధాని అంశంపై వైసీపీ వైఖరిని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. వైసీపీ నేతలు మండలిలో తీర్మానం కోరుతూ, మరోవైపు అసెంబ్లీకి హాజరుకాకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. "మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు అసలు అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా?. అమరావతిని నిజంగా అంగీకరిస్తే అభివృద్ధికి అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారు" అని మంత్రి ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్