AP: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించారు. అయితే విజయ్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పోల్చుతున్న వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిపై జనసేన మాజీ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. విజయ్ ఒంటరిగా వెళ్లి తమిళనాడులో గెలిచారని, పవన్ కళ్యాణ్లా పొత్తులతో గెలవలేదని వైసీపీ నేతలు ఆరోపించడం తగదన్నారు. 2019-24లో జరిగిన అరాచకం వల్ల పవన్ పొత్తు చేసుకున్నారని బొలిశెట్టి అన్నారు.