AP: "మనమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేదే భారతీయ సంస్కృతి" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని జీజీహెచ్లో మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు ఇస్తున్నవారు పెరుగుతున్నారని తెలిపారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా జీవితాంతం వారికి అవసరమైన సహాయం అందించే సంస్కృతి మనదేనన్నారు. రూ.100 కోట్ల వ్యయంతో మాతా–శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.