AP: అమరావతి మహిళలపై కొమ్మినేని శ్రీనివాస్ రావు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్మపర్సన్ భారతిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేలా టీవీ ఛానల్లో చర్చలు జరపడం దారుణమన్నారు. సాక్షి పత్రిక, ఛానల్ ప్రజాసమస్యలను విస్మరించి వైసీపీకి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.